సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాంభూపాల్
ఉమ్మడి అనంతపురం జిల్లా రైతాంగానికి సాగునీరు అందించాలంటే హెచ్ఎల్సిని ఆధునీకరించడమే ఏకైక మార్గమని, ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో సాగునీటి కోసం సిపిఎం పార్టీ చేపట్టిన బస్సు యాత్ర రెండవ రోజు బుధవారం ఉరవకొండకు చేరుకుంది స్థానిక టవర్ క్లాక్ వద్ద ఏర్పాటుచేసిన సభలో జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ తుంగభద్ర, శ్రీశైలం డ్యామ్లు నిండి పొంగి పొర్లుతున్నా జిల్లాకు రావాల్సిన నీరు రాకపోవడం దారుణమన్నారు. అనంతపురం జిల్లా వారసత్వ సంపదగా చెరువులు, కుంటలు ఉన్నాయని, వీటిన్నింటినీ నింపితే రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. నీటి పారుదల కాలువలతో గ్రావిటీ ద్వారా చెరువులు, కుంటలను అనుసంధానం చేయాలనే రైతుల కోర్కెలను పాలకులు అమలు చేయకపోవడం విచారకరం అన్నారు. టిడిపి, కూటమి నాయకులు ఎన్నికల ముందు జిల్లా పర్యటనల్లో హెచ్ఎల్సి ఆధునీకరణ చేస్తామని వాగ్దానాలు చేశారన్నారు. అధికారం చేపట్టి 100 రోజులు పూర్తి అయినప్పటకీ హెచ్ఎల్సి ఆధునీకరణపై ప్రకటన చేయలేదన్నారు. గతనెలలో ఐఎబి సమావేశంలో లక్ష ఎకరాలకు సాగునీటిని అందిస్తామని అధికారికంగా ప్రకటించారని, వస్తున్న నీరు చూస్తే 40 వేల ఎకరాలకు మాత్రమే వచ్చే అవకాశం కన్పిస్తోందన్నారు.
హెచ్ఎల్సి ఆధునీకరణ చేయకపోవడంతో సామర్థ్యానికి తగ్గట్టుగా నీళ్లు తెచ్చుకోలేక పోతున్నామని తెలిపారు. టిడిపి కూటమి ప్రభుత్వం కాలువ ఆధునీకరణ ఎప్పుడు చేపడతారో తెలపాలన్నారు. శ్రీశైలంలో డ్యాం పూర్తిగా నిండి మూడు సార్లు గేట్లు ఎత్తారన్నారు. పూర్తి సామర్థ్యంతో డ్యాం నిండి ఉన్నా బ్యాక్ వాటర్ హంద్రీనీవా ద్వారా తెచ్చుకోవాల్సిన నీటిని తెచ్చుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. డ్యాం నుంచి లిఫ్ట్ ద్వారా నీటిని తీసుకురావాల్సి ఉందన్నారు. ఇందుకు సంబంధించి విద్యుత్ బిల్లులు ఇవ్వాల్సి వస్తుందన్న నెపంతో పాలకులు జిల్లాను ఎండబెడుతున్నారన్నారని తెలిపారు.
బస్సుయాత్రలో వీటన్నింటినీ ప్రజలకు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. అంతేకాకుండా ఈనెల 21వ తేదీన అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద మహా ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మధుసూదన్ నాయుడు, రంగారెడ్డి, అచ్యుత ప్రసాద్, బాల రంగయ్య, చంద్రశేఖర్ నాగమణి, కృష్ణమూర్తి, శ్రీనివాసులు,