పశుసంవర్ధక శాఖ జె. డి వెంకట స్వామి కి ఏపీ గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం వినతులు విశాలాంధ్ర- అనంతపురం : ఆంధ్రప్రదేశ్ గోర్లు మేకల పెంపకదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కోట్ల పోతలయ్య రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షులు సి లింగమయ్య లు స్థానిక కలెక్టరేట్ వద్ద ఉన్న పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకులు జి పి వెంకటస్వామిని శుక్రవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల ప్రాంతాలలో పశు వైద్యశాలలో అరకురా ఉన్న వైద్యులు కాంపౌండర్లు సరిగా పని చేయక గొర్రెలు మేకలు, పశువులు కాపర్లు ఇబ్బందులకు గురి అవుతున్నారు అన్నారు. ఉన్న వాటిలో కూడా ప్రైవేటు దళారులు అందులో పనులు చేస్తూ అనేక చోట్ల పశు వైద్యశాలలో వ్యాపారాలు చేసుకుంటున్నారు అని పేర్కొన్నారు. మేము అనేక చోట్ల పర్యటించడం జరిగిందన్నారు. అనేక సమస్యలు తెలుసుకుని దీనికి న్యాయం చేకూరుస్తారని వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ మధ్యకాలంలోనే నట్టల మందు కూడా రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయడం జరిగిందన్నారు. గొర్రెల మేకలకి సీజనల్ రోగాలు రావడం జరుగుతుందన్నారు. దానికి సరిపడు సరైన సమయంలో మీ శాఖ నుంచి మందులు అందించాలని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సివి హరికృష్ణ, చేతివృత్తిదారుల సమాఖ్య నగర నాయకులు అసితు నారాయణ తదితరులు పాల్గొన్నారు.