విశాలాంధ్ర -శింగనమల మండలం (అనంతపురం జిల్లా): శింగనమల మండల పరిధిలోని నాయన వారి పల్లి గ్రామంలో శుక్రవారం పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 10 లక్షల రూపాయలతో గ్రామానికి మంజూరైన సీసీ రోడ్లు నిర్మాణానికి టిడిపి మండల కన్వీనర్ గుత్తా ఆదినారాయణ గ్రామ సర్పంచ్ రమణమ్మ టిడిపి నాయకులు గుర్రం లక్ష్మీనారాయణ. ఎంపీడీవో నిర్మల కుమారి. ఈ ఓ ఆర్ డి వెంకటలక్ష్మి. ఏపీవో శ్రీదేవి. భూమి పూజ చేశారు, ఈ సందర్భంగా టిడిపి మండల కన్వీనర్ గుత్తా ఆదినారాయణ, సర్పంచ్ రవణమ్మ ఎంపీడీవో నిర్మల కుమారి,లు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తోనే గ్రామ పంచాయతీల అభివృద్ధి పరుగులు పెడుతోందని. పల్లెలు అభివృద్ధి చెందాలన్న దృఢ సంకల్పంతో ఎన్ డి ఏ ప్రభుత్వం పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లువారు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఈసీ దామోదర్ పంచాయతీ కార్యదర్శి ఓబిరెడ్డి వీఆర్వో నాగేంద్ర. టిడిపి నాయకులు మల్లికార్జున. ప్రసాద్. బాబు. ఆంజనేయులు. జి పుల్లయ్య. చిన్న ఆది. శ్రీరాములు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.