ధర్మవరం స్వర్ణకారుల వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు ఖలీల్
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రభుత్వం స్వర్ణకారుల అభివృద్ధికి మరో శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్వర్ణకారులకు ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార పూర్వకంగా ప్రకటించారు. ఈ కార్పొరేషన్ స్వర్ణకారులకు ఎంతో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. దీంతో ధర్మారంలో ఉండే స్వర్ణకారులు వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు ఖలీల్, ఉపాధ్యక్షులు ప్రకాష్ రావు, కార్యదర్శి మోక మురళి హర్షం వ్యక్తం చేస్తూ అంజుమాన్ సర్కిల్ వద్ద కేక్ కట్ చేసి, తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం సంఘం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణకారులకు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం నిజంగా శుభదాయకమని తెలిపారు. ఈ కార్పొరేషన్ వల్ల స్వర్ణకారులకు ముఖ్యమంత్రి అండగా ఉండడం, అభివృద్ధికి శ్రీకారం చుట్టడం పట్ల తాము సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లు వారు తెలిపారు. భవిష్యత్తులో స్వర్ణకారులు అభివృద్ధి బాటలో నడుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోవింద రాజులు, అనిల్ సేట్, సమీర్, షబ్బీర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.