విశాలాంధ్ర -అనంతపురం : భారత కమ్యునిస్టు పార్టీ మైనారిటీ వింగ్ ఇన్సాఫ్ నగర సమితి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ నగర ప్రధాన కార్యదర్శి సూఫీ ఖాజా హుస్సేన్ మాట్లాడుతూ… గత ప్రభుత్వం మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకు లాగా వాడుకుని , మైనారిటీల సంక్షేమానికి ప్రాదాన్యత అస్సలు ఇవ్వకుండా, కేవలం పేరు కోసం పదవులు ఇచ్చి గుత్తాధిపత్యం, ఇష్టానుసారం చలాయించారన్నారు. మైనారిటీల సంక్షేమానికి అస్సలు ప్రాదాన్యత ఇవ్వలేదని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు మైనారిటీల సంక్షేమానికి పెద్ద పీట వేయాలని కోరారు, అంతకు ముందు టీడీపి ప్రభుత్వ హయాంలో అమలు పరచిన దుల్హన్ పథకం సత్వరమే అమలు పరచి నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఊరట కల్పించాలన్నారు. మైనారిటీ హాస్టళ్ల నిర్మాణం, మసీదుల మరమ్మతులకు ప్రత్యేకంగా నిధులు,ఇమాములు, మౌజన్ లకు గౌరవ వేతనం, ముస్లిం మైనారిటీలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా విరివిగా రుణాలు, మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్య ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు సత్వరమే అమలు పరచాలని ముఖ్య మంత్రి చంద్ర బాబు, మైనారిటీ సంక్షేమ మంత్రి నాస్యం ముహమ్మద్ ఫరూఖ్ కి డిమాండ్ చేశారు .ఈ సమావేశంలో మైనారిటీ వింగ్ ఇన్సాఫ్ గౌరవ అధ్యక్షులు అల్లి పిరా , అధ్యక్షులు చాంద్ బాషా, హాజీ వలి, తదితరులు పాల్గొన్నారు .