విశాలాంధ్ర- అనంతపురం : అనంతపురం నగర శివార్ల గుండా ప్రవహించే పండమేరు వంక వరద ప్రభావిత కాలనీలు, ప్రాంతాలలో జిల్లా ఎస్పీ పి.జగదీష్ మంగళవారం పర్యటించారు. పండమేరు వంకకు ఆనుకుని ఉన్న కళాకారుల కాలనీ, విన్సెంట్ డీ పాల్ స్కూలు ప్రదేశం, గురుదాస్ కాలనీ, టి.వి టవర్ శివారు కాలనీ, అనంతపురం-కదిరి జాతీయ రహదారిలోని పండమేరు బ్రిడ్జి, ఆటోనగర్ ప్రాంతాలను ఎస్పీ పర్యటించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఆయా కాలనీల వాసులతో మాట్లాడి వరద నీటి ఉధృతి వల్ల వారు ఎదుర్కొన్న ఇబ్బందులను … తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. డ్రోన్ ల ద్వారా ఆయా ప్రాంతాలలో వరద నీటి పరిస్థితులను పరిశీలించారు. పండమేరు వంక పరిసర కాలనీలు, ప్రాంతాలలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత డీఎస్పీ, సి.ఐ లకు సూచించారు. జిల్లా ఎస్పీ తో పాటు అనంతపురం రూరల్ డీఎస్పీ టి.వెంకటేశ్వర్లు, ఇటుకలపల్లి సి.ఐ హేమంత్ కుమార్ లు వెళ్లారు.