మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయండి
బీసీ హక్కుల సాధన సమితి
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా,
నాయకులు పాలభిందెల శ్రీనివాస్ పిలుపు…….
విశాలాంధ్ర-కుత్బుల్లాపూర్ : అక్టోబర్ 23న బీసీ హక్కుల సాధన సమితి మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా
3వ మహాసభలను నీలం రాజశేఖర్ రెడ్డి భవన్, కాప్రలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో ఉన్న 15 మండలాల నుండి బీసీ ప్రతినిధులు, బీసీ నాయకులు అధిక సంఖ్యలో ఈ మహాసభలకు హాజరు అవుతున్నట్లు తెలిపారు. ఈ మహాసభలకు ముఖ్య అతిధులుగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర బాద్యులు, ఎన్.బాలమల్లేష్, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి రొయ్యల కృష్ణమూర్తి పాల్గొంటున్నారని తెలిపారు.
ఈ మహాసభలో ముఖ్యంగా బీసీ సమస్యలపై చర్చించి భవిషత్తు ఉద్యమ కార్యచరణ
ప్రకటిస్తారని, రాష్ట్ర ప్రభుత్వం బీసీ కుల గణన వెంటనే చేపట్టి
పూర్తి చేయాలనీ, స్థానిక సంస్థల ఎన్నికలల్లో బీసీ లకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసి గ్రామ పంచాయితీ సర్ పంచ్, వార్డ్ సభ్యుల ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయితీల్లో గత 7, 8 నెలల నుండి అధికారుల పాలనతో ప్రజా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడుతున్నాయని, అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురివుతున్నారని అన్నారు.
బీసీ ల అభివృద్ధి, సంక్షేమం, స్వయం ఉపాధి అవకాశల కోసం, తదితర సమస్య పరిస్కారం కోసం సమావేశంలో చర్చింది భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని, మేడ్చల్ జిల్లాలోని మండల, గ్రామాల నుండి బీసీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ నెల 23 న నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ కాప్రలో జరుగు బీసీ హక్కుల సాధన సమితి మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలనీ బీసీ హక్కుల సాధన సమితి జిల్లా నాయకులు పాలభిందెల శ్రీనివాస్, తెలిపారు.