కొత్త బ్రిడ్జిపై రాకపోకలు కొనసాగించాలని అనంతపురం డీఎస్పీ విజ్ఞప్తి
విశాలాంధ్ర అనంతపురం : అనంతపురం-కదిరి జాతీయ రహదారిపై ఉన్న పండమేరు పాత బ్రిడ్జిను మరమ్మతుల నిమిత్తం వాహనాల రాకపోకలు జరుగకుండా మూసివేస్తున్నట్లు అనంతపురం డీఎస్పీ వి.శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కదిరి, ధర్మవరం, రాప్తాడుల నుండీ వచ్చే వాహనాలు ఇక నుండీ సదరు పాత బ్రిడ్జి పక్కనే ఉన్న కొత్త బ్రిడ్జి మీద రాకపోకలు సాగించాల్సి ఉంటుందన్నారు. అనంతపురం నుండీ కదిరి, ధర్మవరం, రాప్తాడుల వైపు వెళ్లే వాహనాలకు మరియు కదిరి, ధర్మవరం, రాప్తాడుల వైపు నుండీ అనంతపురం నగరంలోకి వచ్చే వాహనాల రాకపోకలు పండమేరు కొత్త బ్రిడ్జి మీద సాగించాలని సూచించారు. వాహనాల చోదకులు పోలీసులతో సహకరించి సూచించిన మేరకు ఒకే బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు కొనసాగించాలని డీఎస్పీ కోరారు.