విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని విద్యుత్ వినియోగదారులు అందరూ కూడా సకాలంలో విద్యుత్ ఛార్జీలు చెల్లించి విద్యుత్ కార్యాలయ ఆదాయానికి అభివృద్ధికి సహకరించాలని విద్యుత్ డి. వన్-అధికారి వి. నాగభూషణం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెక్నాలజీ పెరిగే కొద్దీ వినియోగదారులు కూడా తమ విద్యుత్ బిల్లులను పలు రకాలుగా చెల్లించే అవకాశం ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ఇందులో గత కొన్ని నెలలుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద, ముఖ్యమైన కూడలి వద్ద, చిన్న, పెద్ద వ్యాపార సంస్థల వద్ద మా స్కానర్ను అతికించడం జరిగింది. ఈ స్కానర్ తో బిల్లులు సులభతరంగా చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాకుండా ఏపీఎస్పీడీసీఎల్ ద్వారా గాని, ఎస్పీడీసీఎల్ యాప్ ద్వారా గాని, పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద గల విద్యుత్ కార్యాలయం వద్ద గాని చెల్లించవచ్చునని తెలిపారు. ఫోన్ పే స్వీకరించబడవు అని తెలిపారు. త్వరలో కరెంట్ బిల్లు లోనే స్కానర్ ఏర్పాటు ఉంటుందని, అప్పటికప్పుడే ఆ స్కానర్ ద్వారా కూడా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చునని తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని డి- వన్ పరిధిలో కరెంటు లేకున్నాను, ఇతర సమస్యలపై 08559-222345 కు గాని టోల్ ఫ్రీ నెంబర్ 1912 కు గాని సంప్రదిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.