విశాలాంధ్ర -అనంతపురం : కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంగళగిరి వారి ఉత్తర్వులుమేరకు ఎం పి హెచ్ డబ్ల్యు ఫిమేల్ ట్రైనింగ్ స్కూల్ అనంతపురం నందు ఏఎన్ఎం కోర్సులో ప్రవేశం కొరకు అప్లికేషన్లను సమర్పించుటకు గడువు ఈనెల 31 వరకు పొడిగించడం జరిగిందని అలాగే ఈ కోర్సులో చేరుటకు వయసుతో నిమిత్తం లేకుండా చేరవచ్చునని కావున ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశమును వినియోగించుకోగలరని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవి ఒక ప్రకటనలో కోరడమైనది.