Saturday, October 26, 2024
Saturday, October 26, 2024

రోగులకు సేవ చేయుట దైవ సేవతో సమానం

శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ నామ ప్రసాద్

విశాలాంధ్ర ధర్మవరం:: రోగులకు సేవ చేయుట దైవ సేవతో సమానమని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, వారి సహాయకులకు 360 మందికి ఆసుపత్రిలోని వైద్యులు నర్సుల చేతులు మీదుగా భోజనపు ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలకు స్వీట్లు కూడా పంపిణీ చేశారు. అనంతరం నామా ప్రసాద్ మాట్లాడుతూ ఈ సేవా కార్యక్రమానికి దాతలుగా కీర్తిశేషులు ఆవుల కిష్టప్ప జ్ఞాపకార్థం కుమారుడు శ్రీనివాసులు నిర్వహించడం జరిగిందని, ఇందుకు తాము ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలకు ఆసక్తిగా ఉన్న దాతలు సెల్ నెంబర్ 9966047044కు గాని 903044065కు గాని సంప్రదించవచ్చునని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ సత్య సాయి సేవా సమితి చేస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తాయని తెలిపారు. తదుపరి సేవాసమితి వారికి ఆసుపత్రి తరఫున కృతజ్ఞతలను తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img