Sunday, October 27, 2024
Sunday, October 27, 2024

రూ 100 సభ్యత్వం తో ఐదు లక్షల ప్రమాద భీమ

విశాలాంధ్ర – ఎ. కొండూరు : రూ 100 వంద రూపాయలు టిడిపి సభ్యత్వంతో ఐదు లక్షల ప్రమాద భీమ పొందవచ్చని తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ రావు అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 2024-26 టిడిపి సభ్యత్వ కార్యక్రమాన్ని ఏ కొండూరు మండలం రేపూడి గ్రామంలో టిడిపి నాయకులు కార్యకర్తలు నడుమ శనివారం ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు లాంచనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రూపాయల సభ్యత్వం నుండి ఈ రోజున వంద రూపాయల సభ్యత్వం వరకు వెళ్లిన ఘనత టిడిపి పార్టీ కి చెందుతుందని టిడిపి కార్యకర్తలు సభ్యత్వం నమోదు చేసుకోవడం టిడిపి నాయకులకు కార్యకర్తలకు ఒక గౌరవంగా మారిందని ఆయన అన్నారు ఆదే విధంగా తిరువూరు నియోజకవర్గంలో ఈసారి 1,20,000 సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తనే స్వయంగా పర్యవేక్షించి టిడిపి సభ్యత్వాలను నమోదు చేయించేందుకు కృషి చేస్తానని అన్నారు . రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వారీ ఆచరణ మేరకు తిరువూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అగ్ర పదంలో నడిపించే విధంగా కృషి చేయడానికి తను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు అదే విధంగా నియోజకవర్గంలో పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తాను సొంత నిధులతో ఏర్పాటు చేసిన అంబేద్కర్ స్టడీ సర్కిల్ నందు ఉచిత శిక్షణ అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు అలానే నాకు ఏ కొండూరు మండలం అంటే ఎంతో ఇష్టమైనదిగా భావించి మండలంలో ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దటమే కాకుండా గ్రామాల్లో మౌలిక వసతులు రూపకల్పనకు తన వంతుగా కృషి చేస్తానని అలానే జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి కృష్ణా జలాల నీటి కుళాయిని అందించే అందుకు పైపులైన్ నిర్మాణ పనులు పెద్ద ఎత్తునప్రాతిపన జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా టిడిపి మొదటి సభ్యత్వ కార్యక్రమాన్ని టీడీపి మండల పార్టీ అధ్యక్షులు గడ్డి కృష్ణారెడ్డికి సభ్యత్వాన్ని నమోదు చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ అలవాల రమేష్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి వాసం మునియా మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వనపర్ల డేవిడ్ రాజు రేపూడిమాజీ సర్పంచ్ కోటేశ్వరరావు పోలిశెట్టిపాడు సర్పంచ్ చిట్టిబాబు పిన్నమనేని శ్రీనివాసరావు మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ ఆదం షరీఫ్ బెజవాడ శంకర్ మోర్ల తిరుపతిరావు వివిధ గ్రామాలకు చెందిన టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img