Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం ఏర్పడాలి

తెదేపా గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆనంద్

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- తెదేపా, జనసేన, బిజెపి ల కూటమి బలపరిచిన అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి గెడ్డి ఈశ్వరులను గెలిపించుకోవడంతో పాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడితేనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధికి నోచుకుంటుందని తెదేపా గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనంద్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థుల విజయానికై పార్టీ శ్రేణులతో కలిసి ఆయన మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో వైకాపా అనుసరించిన అరాచక పాలనను ఓటర్లకు వివరిస్తూ కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించాలని అభ్యర్థించారు. ఈనెల 13న జరగబోవు సార్వత్రిక ఎన్నికలలో అరకు పార్లమెంటు సభ్యురాలిగా పోటీ చేస్తున్న కొత్తపల్లి గీతకు కమలం పువ్వు గుర్తు పై, అదేవిధంగా పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరి కి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తద్వారా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ఆశీర్వదించాలని ఈ సందర్భంగా ఓటర్లను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు దూరి రామకృష్ణ, మంగ్లు, సుబ్బారావు, బిజెపి, జనసేన నాయకులు కదుల్ల శ్రీనివాసరావు, గొర్లె సోమేశ్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img