మాలి తెగ గిరిజనులకు శాస్త్రవేత్తల సూచన
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- గంజాయి వంటి సాగు జోలికి పోకుండా గిరి రైతులు ఆర్థికంగా లాభాలను ఇచ్చే గౌరవప్రదమైన అత్యాధునిక పంటల సాగు వైపు మొగ్గుచూపి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని భగవత్ చారిటబుల్ ట్రస్ట్ శాస్త్రవేత్తలు అన్నారు. మంగళవారం మండలంలోని చౌడుపల్లి పంచాయతీలో ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ గంజాయి వంటి అసాంఘిక సాగును మాని అత్యాధునికంగా ఉంటూ ఆర్థికంగా లాభాలను ఇచ్చే పంటల సాగును ప్రతి గిరిజనుడు చేపట్టాలన్నారు. వాటి సాగులో మెలకువలను శాస్త్రవేత్తల సూచనలు, సలహాల ద్వారా అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ ట్రస్ట్ శాస్త్రవేత్తలు, సభ్యులతో పాటు స్థానిక ఎస్సై అరుణ్ కిరణ్, అధిక సంఖ్యలో మాలి తెగ గిరిజనులు పాల్గొన్నారు.