ఏ.పి. రైతు సంఘం డిమాండ్
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.27.06.2024ది. రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం కూటమి ప్రవేశ పెట్టిన ” అన్నదాత సుఖీభవ ” పథకంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో రైతాంగానికి రూ. 20,000లు అందజేయాలని ఏ.పి.రైతు సంఘం అనకాపల్లి జిల్లా జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ చేస్తున్నారు. చోడవరం రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కు గురువారం వినతిపత్రం అందజేశారు. అనంతరం రైతు సంఘం, కమ్యూనిస్టు నేత రెడ్డిపల్లి మాట్లాడుతూ రైతులకు అన్నదాత సుఖీభవ కింద 20 వేల రూపాయలు వెంటనే మంజూరు చేయాలని, విత్తనాలు పురుగుమందులు, ట్రాక్టర్లు మున్నగు వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై ఇవ్వాలని కోరారు. వ్యవసాయ యాంత్రీకరణ లో సబ్సిడీ కొనసాగించాలన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు బ్యాంకుల ద్వారా రూ.5 లక్షలు వరకు 0.25 పైసలు వడ్డీతో ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం రైతులను పూర్తిగా మోసం చేసి, నష్టాలు బాటలోకి నెట్టిందని ఇప్పుడున్న ప్రభుత్వాలు రైతులను ఆదుకుని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని, రిజర్వాయర్ నుంచి వచ్చిన నీరు పంట కాలువల ద్వారా పంటలకు అందే విధంగా పంట కాలువల్లో పూడికతీత, మరమ్మత్తు లు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిల్లి గణేష్ సబ్బవరపు గణేష్ బొబ్బిలి శంకర్రావు పూలు ప్రసాద మరియు రైతుల పాల్గొన్నారు