– చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ…
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.06.07.2024ది. దివంగత సి.ఎం.డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఈ నెల 8 వ తేదీన గ్రామ గ్రామాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంప్ కార్యాలయంలో శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ
ఇందుకు సంబంధించి ముందుగానే గ్రామాల్లో గల వైఎస్ఆర్ విగ్రహాలను శుభ్రపరిచి పెయింటింగ్లు వేసి అంగరంగ వైభవంగా జయంతి వేడుకలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇప్పటికే పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. అవకాశం ఉన్నంతవరకు శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.