విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : తే.08.05.2024ది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తి పై అనుమానం వున్నను, లేదా మీ ఓటు ఇతరులు వేసినను, పోలింగ్ ఏజంట్లు, ఓటర్లు సవాల్ చేయవచ్చు. ఓటరు జాబితాలో వున్న పేరు, వయస్సుకు, వాస్తవంగా వచ్చిన ఓటరుకు తేడా ఉంటే, ప్రిసైడింగ్ అధికారికి రూ.2లు చెల్లించి, ఆ ఓటును ఛాలెంజ్ చేయవచ్చు. ఓటరు ఇంటి దగ్గర లోని వ్యక్తులను సాక్షులుగా విచారిస్తారు. ఆ ఓటరు భోగస్ అని తేలితే, పోలీ సుల కు అతడ్ని అప్పగించి రూ.2 లు ఏజంట్ కు తిరిగి ఇస్తారు. ఓటరు సరి అయిన వ్యక్తి అని తేలితే రూ.2లు ప్రభుత్వానికి చెల్లిస్తారు