విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : తే.20.03.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ శ్రీ శ్రీ దత్తాత్రేయ సహిత అభయాంజనేయ స్వామివారి విగ్రహను బుదవారం ఉదయం వేద పండితులు ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్టించారు. వేద రుత్వికుల చే మంగళ వారం విఘ్నేశ్వర పూజ తో ప్రారంభం చేసి, స్వస్తి పుణ్యాహవా చనం, దీక్షా ధారణ, పంచగవ్య ప్రాసన, రుత్విక్ వరుణ యాగశాల ప్రవేశం, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మహిళా మండలి వారిచే లలిత సహస్రనామ పారాయణం సాయంత్రం నాలుగు గంటలకు చతుర్వేద పారాయణ ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేద పారాయణం జరిపించారు. బుధవారం ఉదయం నిత్యక్షరాల హోమాలు, ప్రాతః కాల అర్చనలు, అర్చక బృందం నేతృత్వంలో ప్రతిష్ట జరిపించారు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం అధ్యక్షులు కలగర్ల శేషగిరిరావు చేతుల మీదుగా దత్తాత్రేయ సహిత అభయాంజనేయ స్వామి, విద్యా ప్రతిష్ట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చోడవరం వాసవి క్లబ్, వనితా క్లబ్, యూత్ క్లబ్ గౌరవ సభ్యులు తదితరులు పాల్గొని దైవ కార్యక్రమాల అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు.