విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.01.07.2024ది. చోడవరం చుట్టుపక్కల గ్రామాల్లో సోమవారం ఉదయం నుంచే స్థానిక కూటమి ఎమ్మెల్యే కె. ఎస్.ఎన్.ఎస్.రాజు చేతుల మీదుగా ఫించన్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే, బి.జె.పి., జనసేన, టి.డి.పి. కార్యకర్తలు నాయకులు పలు గ్రామాల్లో పెంచిన ఫించన్లు లబ్ధిదారులకు పంపిణీ చేపట్టారు. లక్ష్మీపురం, గాంధీ గ్రామంలోను టిడిపి జనసేన బిజెపి ఉమ్మడిగా సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో బాటు రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు గూనూరు మల్లునాయుడు, మాజీ వైస్ ఎం.పి.పి. భూతనాథు నానీ కుమార్, మాజీ సర్పంచ్ చింతల దేవ నాగ ఎర్రి నాయుడు, సండ్రన వీరన్న, ఎంపీటీసీ సిరిసోల చిన్నం నాయుడు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.