విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : భారతీయ రైల్వే ప్రయాణీకులకు మరో తీపి కబురు చెరవేసింది. స్లీపర్ కోచ్ టిక్కెట్తో మాత్రమే ఏసీ కోచ్లో ప్రయాణించవచ్చు. దీనికి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. రైలులో స్లీపర్ కోచ్ టిక్కెట్ను బుక్ చేసుకోవడం ద్వారా ఏసీ కోచ్లో ప్రయాణించవచ్చు. దానికి మీరు చేయవలసిందల్లా టికెట్ బుకింగ్ సమయంలో “ఆటో-అప్గ్రేడ్” ఎంపికను టిక్ చేయాలి. ఏదైనా ఉన్నత తరగతి సీటు లేదా బెర్త్ ఖాళీగా ఉంటే, ప్రయాణీకుల టిక్కెట్ ఆటోమేటిక్గా అప్గ్రేడ్ చేయబడుతుంది.