London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Saturday, October 5, 2024
Saturday, October 5, 2024

జగనన్న భూ రక్షణ పాసు పుస్తకాలు రద్దు చేయాలి…

నాణ్యమైన పరికరాలతో రీ సర్వే జరపాలి…

– భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్…
విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : తే.04.01.2024ది. బటాకపు జగనన్న భూ రక్షణ పాసు పుస్తకాలు రద్దు చేయాలని, నాణ్యమైన పరికరాలతో రైతాంగానికి నమ్మకం కలిగించే విధంగా రీ సర్వే జరపాలి అని భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ), రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ చేస్తున్నారు. కమునిస్ట్ పార్టీ, అనుబంధ రైతు, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో గురువారం చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద తీవ్ర నిరశన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డిపల్లి మాట్లాడుతూ జగనన్న భూ రక్షణ పథకం ద్వారా ఇస్తున్న పాసు పుస్తకాలును రద్దు చేయాలని, నాణ్యమైన సాంకేతిక పరికరాలతో భూ సమగ్ర రీ సర్వే చేయాలన్నారు. ఇప్పుడు ఇస్తున్న జగనన్న పాసు పుస్తకాలకు బ్యాంకుల్లో చెల్లుబాటు కావట్లేదు అని తెలిపారు. ప్రభుత్వం అందించే వాటిని నిరుపయోగమైన పాసుపుస్తకాలు గానిర్ధారిస్తామని అన్నారు. రైతులకు రీ- సర్వేలో నాణ్యమైన సాంకేతిక యంత్రాలతో సర్వే జరుపకపోవడం వల్ల వారికి చెందిన భూమి పాసుబుక్కుల్లోకి ఎక్కే పరిస్థితి లేదని, దీనివలన రైతుల మధ్యలో ఘర్షణలు చోటు చేసుకున్నాయిని తెలిపారు. ఇప్పటికైనా సి.ఎం. స్పందించి రీ సర్వే జరిపి రైతులకు నాణ్యమైన, నమ్మకమైన పట్టాదార్ పాస్ పుస్తకం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు మల్లం వెంకటరావు, బండ అర్జున్ రావు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఆబోతుల శ్రీనివాసరావు, కర్రి శ్రీనివాసరావు, రైతు నాయకులు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img