విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : పెంచిన ఫించన్లు ఒకటవ తేదీన ఇస్తానన్న మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అందజేసిన సి.ఎం. చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సి.ఎం. పవన్ బాబు చిత్ర పటానికి గోవాడ లోని ఫించన్ దారులు మంగళవారం పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు మాట్లాడుతూ కూటమి పాలనలో లబ్ధిదారుల ముఖంలో చిరునవ్వు చూసామన్నారు. పెంచిన ఫించన్లు మెత్తాన్ని ఒకటవ తేదీన పంపిణీ చేసిన చంద్రబాబు ఒక విజన్ గల నాయకుడిగా ప్రజల్లో మరోమారు గుర్తింపు పొందారన్నారు. ఎన్నిక ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమవుతుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు, గోవాడ సుగర్స్ మాజీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు, బి.సి. సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పూతి కోటేశ్వరరావు, గూనూరు పెదబాబు, టి.డి.పి. మండల పార్టీ అధ్యక్షుడు నాగ గంగాధర్, మాజీ సర్పంచ్ ఏడువాక లక్ష్మణ్ కుమార్, జనసేన జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లం రామ అప్పారావు, ఫించన్ దారులు తదితరులు పాల్గొన్నారు.