విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : ఏ.పి. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5,6,7 తేదీల్లో కర్నూలు లో జరిగిన రాష్ట్రస్థాయి యోగ పోటీలలో చోడవరం పతంజలి యోగా శిక్షణ కేంద్రం విద్యార్థి గొంతిన లయ వర్ధన్ మూడవ స్థానం సాధించి, నవంబర్ లో అస్సాం లో జరుగు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు యోగ గురువు పుల్లేటి సతీష్ మంగళవారం మీడియాకు తెలియజేసారు. జాతీయస్థాయి యోగ పోటీల్లో పాల్గొని పతంజలి యోగ కేంద్రానికి జాతీయస్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని యోగ గురువు పుల్లేటి సతీష్ కోరారు. యోగ క్రీడాకారుడు లయ వర్ధన్ ను చోడవరం ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజు, పతంజలి యోగ శిక్షణ కేంద్రం చైర్మన్ పసుమర్తి అశోక్, డాక్టర్ బంగారు కృష్ణ, ఉషోదయ విద్యాసంస్థల చైర్మన్ జెర్రిపోతుల రమణాజీ, సీనియర్ పాత్రికేయులు ఓరుగంటి రాంబాబు, యోగ టీచర్స్ బోగవిల్లి గణేష్, కొట్టాపు హరి కిరణ్, యోగా శిక్షణ కేంద్రం సభ్యులు, ప్రముఖులు, ప్రజలు అభినందించారు.