London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

పుట్టుకతో వచ్చు లోపాలపై వైద్యాధికారులకు శిక్షణ కార్యక్రమాలు

విశాలాంధ్ర – అనంతపురం : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ .ఈ బి దేవి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ వారి ఆదేశాల మేరకు మూడవ బ్యాచ్ లో అర్బన్ మెడికల్ ఆఫీసర్లకు స్టాఫ్ నర్స్ మరియు ఏఎన్ఎం లకు రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా పుట్టుకతో వచ్చు లోపాలపై బుధవారం వైద్య ఆరోగ్య శాఖ కాన్ఫరెన్స్ హాల్ నందు శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…
శిక్షణలో ముఖ్యంగా పిల్లలలో పుట్టుకతో వచ్చే లోపాలు గుర్తించుట తల నుంచి పాదం వరకు చేసే పరీక్ష విధానము అప్పుడే పుట్టిన నవజాత శిశువు వయసు నుండి అంగన్వాడి మరియు కాలేజీ విద్యార్థుల వరకు వైద్య పరీక్షలు నిర్వహించి పుట్టుకతో వచ్చే లోపాలను పోషకాహార పెరుగుదల లోపాలు, జన్యుపరమైన లోపాలు, వైకల్యాలు, బరువు తక్కువ గల పిల్లలు ,నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలు, మెల్ల కన్ను,గ్రహణ మొర్రి ,వంకర పాదాలు ,కంటి శుక్లాలు, వినికిడి లోకం ,గుండె సంబంధిత వ్యాధులు వివిధ రకాల అంటు వ్యాధులను గుర్తించి సత్వర చికిత్స అందించుట శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో చికిత్స చేయలేని వారికి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని త్వరిత చికిత్స కేంద్రానికి నెంబర్ 99 ఓపి కేంద్రానికి రెఫర్ చేయాలన్నారు.
తదుపరి త్వరిత చికిత్స కేంద్రంలో స్క్రీనింగ్ నిర్వహించి తగువిధంగా చికిత్సలు ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ మొదలగు సర్వీసులను అందిస్తున్నాము.
తదుపరి శస్త్ర చికిత్సల అవసరమైన పిల్లలకి ఉచితంగా ఆపరేషన్లు చేపడుతుందన్నారు .అందులో వినికిడి లోపం, మెల్లకన్ను, కంటి రెటీనా, పెదవి, నోరు, గుండె పనితీరు లో లోపం వంటి పిల్లలకు దాదాపు 8 నుంచి10 లక్షల రూపాయల వరకు ఉచితంగా చికిత్స అందించబడుతుందన్నారు. వినికిడి లోపం గల పిల్లలకి వినికిడి పరికరాలు ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు.. డి ఈ ఐ సి నందు పై వ్యాధులకు ప్రత్యేకమైన తెరపిస్టులు చికిత్సలు మరియు రిహాబిలిటేషన్ అందిస్తారన్నారు . ప్రతి ఫెసిలిటీలో అడాలసెంట్ బాల, బాలికల కోసం ప్రత్యేక స్నేహపూరిత క్లినిక్ ను అందించాలన్నారు. బడి బయట ఉన్న కౌమార బాలికలకు అనీమియా వ్యాధి- హిమోగ్లోబిన్ పరీక్ష నిర్వహించి అవసరమైన వారికి ఇంటి వద్దనే నీలం రంగు ఐరన్ టాబ్లెట్లు నెలకు సరిపడా ఇవ్వాలన్నారు. ,నెలకు ఒక్కసారైనా విద్యాధికారి తన పరిధిలోని విద్యాలయాల్లో మెడికల్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించాలన్నారు. అన్ని అంగన్వాడి, ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలందరికీ మెడికల్ స్క్రీనింగ్ చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ .జి. నారాయణస్వామి, చిన్న పిల్లల వైద్యులు డాక్టర్. శ్రీవిద్య, మెడికల్ ఆఫీసర్ డాక్టర్. మల్లీశ్వరి ,డి ఈ ఐ సి మేనేజర్ డి.రజిత మరియు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img