జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
విశాలాంధ్ర – అనంతపురం : గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్ లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, సకల సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ అధికారులను ఆదేశించారు. శనివారం అనంతపురం నగరంలోని నాయక్ నగర్ లో ఉన్న గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్ ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్ లో గదులన్నీ శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విద్యార్థులకు అవసరమైన తాగునీరు అందుబాటులో సిద్ధంగా ఉంచాలని, గదుల్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. హాస్టల్లో రికార్డులన్నీ అప్డేట్ చేసి పెట్టుకోవాలన్నారు. వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు హాస్టల్ కు వచ్చేలా ఫోన్లు చేసి పిలిపించాలన్నారు. హాస్టల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిటిడబ్ల్యూఓ రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.