అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : ఆస్తి పన్ను విషయంలో సచివాలయ ఉద్యోగులైన అడ్మిన్ కార్యదర్శులు, ఆరైలు, ఆర్వోలు ప్రత్యేక శ్రద్ధను కనపరిచి, ఒక టీం వైజ్ గా వెళ్లి పనులను వసూలు చేయాలని అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారికి మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో సమావేశాన్ని నిర్వహించి, పన్ను వసూలులో తీసుకోవలసిన జాగ్రత్తలు, సలహా, సూచనలను ఇవ్వడం జరిగింది. ఈనెల 30వ తేదీలోగా 2024_25 సంవత్సరపు ఆస్తి పన్ను పూర్తి మొత్తంలో రెండు శాతం రాయితీ ఉంటుందని, ఈ విషయాన్ని పన్ను కట్టే వారికి తెలియజేయాలని తెలిపారు. ఆస్తిపన్ను విషయంలో నిర్లక్ష్యం లేకుండా, కచ్చితంగా విధులతో కూడినటువంటి బాధ్యతగా వసూలు చేయాలని తెలిపారు. ఈ పన్నులను మున్సిపల్ కార్యాలయంలోనూ, ఎస్బిఐ కాలనీలోని సచివాలయం, పార్థసారథి నగర్ సచివాలయం (ఎర్రగుంట దేవి నర్సింగ్ హోమ్ ఎదురుగా), ఆన్లైన్ ద్వారా కూడా కట్టించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇప్పటివరకు ఎన్నికల పనులు ఉన్నందున, పన్నుల విషయంలో కొంత జాప్యం జరిగిందని, ఈ మాసాంతం లోపు అనుకున్న టార్గెట్ ను ప్రతి ఒక్కరూ పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్, ఆర్వో.. ఆనంద్ పాల్గొన్నారు.