Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

పేద, బడుగు, బలహీన వర్గాలు అభ్యున్నతికి కాంగ్రెస్ ను గెలిపించండి

ఇండియా కూటమి అభ్యర్ధి జగతా శ్రీనివాసరావు

విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా ) : తే.07.05.2024ది. పేద, బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతికి జాతీయ కాంగ్రెస్ పార్టీని గెలిపించలసిందిగా ఇండియా కూటమి చోడవరం ఎమ్మెల్యే అభ్యర్ధి జగతా శ్రీనివాసరావు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వెంకన్నపాలెం గ్రామంలో పోలమాంభ ముఠా కార్మికులను కలసి జాతీయ కాంగ్రెస్ పార్టీకు ఓటు వేయవలసిందిగా అభ్యర్ధించారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్ధి వేగి వెంకటేష్ తో కలసి నిర్వహించిన బైక్ ర్యాలీ విజయవంతం అయిందని తెలిపారు. ప్రాంతీయ పార్టీల పాలనలో ప్రజలందరూ విడిగిపోయారని, సుస్థిరమైన, న్యాయమైన పరిపాలన అందించగలిగే పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీయే అని తెలియజేసారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని స్వాగతిస్తున్నారన్నారు. వేకువ జామునే ఉపాధి హామీ కార్మికులను కలసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వివరించామని తెలిపారు. మహిళలకు రక్షణ, స్వయం సమృద్దికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని అన్నారు. ఈ నెల 13 న నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల్లో హస్తం గుర్తు పై తమ అమూల్యమైన ఓటును వేసి అఖండ విజయం చేకూర్చాల్సిందిగా పలువురిని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img