Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

5న విశ్రాంతి ఉద్యోగుల భవనంలో వైద్య శిబిరం

విశాలాంధ్ర- ఉరవకొండ : ఈనెల 5వ తేదీన ఆదివారం ఉరవకొండ లోనే విశ్రాంతి ఉద్యోగుల భవనం నందు సుశీల నేత్రాలయ, మరియు సాయి ఎడ్యుకేషన్ సొసైటీ వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు కె. క్రిష్టప్ప తెలిపారు. గురువారం ఉరవకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంతి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంప్లాయిస్ హెల్త్ కార్డు, మరియు డాక్టర్ వైయస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు ద్వారా శుక్లాం ఆపరేషన్ ఉచితంగా చేయబడునని తెలిపారు. వైద్య శిబిరానికి వచ్చేవారు తప్పనిసరిగా హెల్త్ కార్డును తీసుకురావాలన్నారు. ఈ వైద్య శిబిరానికి సంబంధించి ఎవరికైనా సందేహాలు అనుమానాలు ఉంటే 99890 39099 ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img