8 అడుగుల ఇనుప తీరు రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన వైనం
రైల్వే పైలట్ ముందుగా పసిగట్టడంతో ప్రయాణికులు సురక్షితం
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని గాంధీనగర్ (సమాధులకు ఎదురుగా) గల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ రైలు పట్టాలపై ఈనెల 18వ తేదీ రాత్రి 10 గంటల13 నుండి 10 గంటల 18 నిమిషాల మధ్య చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆర్పీఎఫ్సీఐ బోయ కుమార్ మాట్లాడుతూ ఈనెల 18వ తేదీ రాత్రి బీదర్ రైలు ఎక్స్ప్రెస్ (రైలు నెంబర్ 16571) (యశ్వంతపూర్ నుండి బీదర్ కు వెళ్ళు రైలు) ధర్మవరంలో కు చేరుకోగానే రైలు లోకో పైలట్ వాకీటాకీ ద్వారా తమకు కమ్యూనికేషన్ అందించడం జరిగిందని తెలిపారు. ఫోన్ నెంబర్ 177/21 వద్ద రైల్వే ట్రాక్ కి అడ్డంగా రైల్వే పట్టాలపై సుమారు 8 అడుగుల ఇనుప తీరును లోకో పైలట్ గమనించడం జరిగిందన్నారు. హుటా హుటిన ఎమర్జెన్సీగా బ్రేకులు వేయడం జరిగిందని, తదుపరి లోకోమోటివ్ గాడితో ఐరన్ ఛానల్ కొట్టి పడినప్పటికీ లోకోమోటివ్ ఎటువంటి నష్టము జరగలేదని తెలిపారు. ఈ సమాచారాన్ని అందుకున్న తర్వాత ఐపిఎఫ్, ఐఆర్పి, ఎస్ఐపిఎఫ్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగిందన్నారు. అక్కడ ఘటనా స్థలంలో ఇనుప తీరును కనుగొని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సుమారు 15 కిలో గ్రాముల బరువు గల దాదాపు 8 అడుగులు పొడుగు ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఈ ఇనుప తీరు రైల్వే కు సంబంధం కాదని వారు తెలిపారు. అయినప్పటికీ సంఘటన జరిగిన సమయంలో సమీపంలోని మొబైల్ ఫోన్ కార్యాచరణను విశ్లేషించడానికి లొకేషన్ యొక్క టవర్ డంపును పొందడం జరిగిందన్నారు. ఈ డేటా ద్వారా త్వరలో నిందితులను గుర్తించి పట్టుకునేందుకు అన్ని చర్యలు చేపడతామని తెలిపారు. మొత్తం మీద రైల్వేలోని ప్రయాణికులు అనుకోకుండా రైలు ఆగడంతో ఏమి జరిగిందో ఏమో అని భయాందోళనకి గురయ్యారు. తదుపరి ఏమీ జరగకపోవడంతో ఊపిరి పీల్చుకొని ప్రయాణాన్ని కొనసాగించారు. అనంతరం ఆర్పీఎఫ్ పోలీసులు క్రైమ్ నెంబర్ 216/2024 యు/ఎస్ 154 అండ్ 147 ఐఆర్ఓ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రైల్వే చట్టం 1989/19/6/24 ప్రకారం ఈ చర్యకు బాధ్యులైన వారిని గుర్తించి పట్టుకోవడానికి త్వరితగతిన ప్రయత్నాలను ముమ్మరం చేస్తామని తెలిపారు.