విశాలాంధ్ర కళ్యాణదుర్గం టౌన్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రభుత్వ ఉపాధ్యాయులను పరమార్శించి మానవత్వం చాటుకున్నతెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు.శుక్రవారం కళ్యాణదుర్గం నుంచి పదవ తరగతి స్పాట్ వాల్యుయేషన్ కోసం మిత్ర బృందంతో కలిసి అనంతపురం వెళుతుండగా దురదృష్టవశాత్తు అనిమిరెడ్డిపల్లి సమీపాన రెండు కార్లు ఢీకొని గాయపడిన ఉపాధ్యాయులను మానవత్వంతో జిల్లా కేంద్రానికి వెళ్లి అమిలినేని పరిమర్శించారు. ఎదురుగా వస్తున్న కారు పంచర్ కావడంతో ఘటన చోటుచేసుకుందని వారు పేర్కొన్నారు.ఈ ప్రమాదంలో తిప్పే స్వామి, రామచంద్ర, రాజశేఖర్ లకు తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టామన్నారు.