విశాలాంధ్ర-తాడిపత్రి: పెద్దపప్పూరు మండలంలోని జూటూరు గ్రామంలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో విద్యార్థులకు డెంగ్యూ వ్యాధిపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆరోగ్య పర్యవేక్షకులు శర్మాస్ వలి ప్రిన్సిపల్ బి.బయమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెంగు జ్వరం ప్లావి విరిడే కుటుంబానికి చెందినా ప్లావి వైరస్ ద్వారా వస్తుంది. ఈ వైరస్లను ఏడిస్ దోమలు ఒకరి నుండి ఒకరికి డెంగు జ్వరాన్ని వ్యాప్తి చేయును. ఈ దోమలు చిన్నగా నల్లగా ఉండి శరీరం పైన తెల్లని చారలు ఉండును, తలపైన రెండు చారులు ఉండి దానికి ఇరువైపులా కొడవలి ఆకారంలో గుర్తులు ఉండును. ఈ దోమలు ఎక్కువగా పగటి పుట కుట్టును. ఈ దోమలు మన ఇంటి లోను ఇంటి పరిసరాలలో పరిశరాలలోని మంచి నీటిలో పెరిగును. కావున ప్రతి ఒక్కరు డ్రై డే ఫ్రై డే ని పాటించి, దోమ లార్వా దశలోనే నివారించాలి. దోమ ఆవాస ప్రాంతాలైన పాత టైర్లు, కొబ్బరి బొండాలు, పాత పనికి రాణి ఇనుప డబ్బాలు తదితర వాటిని ఎప్పటి కప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త టి.శరత్ బాబు, ఆరోగ్య సిబ్బంది కె.నగీన, కె. సుస్మలత, రామంజంనమ్మ పాల్గొన్నారు.