విశాలాంధ్ర – అనంతపురం : జిల్లా వైద్య ఆరోగ్య మరియు శాఖాధికారి కార్యాలయం లోని జిల్లా మలేరియా ఆఫీస్ నందు నెల వారీ ల్యాబ్ టెక్నీషిన్ల సమావేశం జిల్లా మలేరియా అధికారి ఆధ్వర్యం లో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా మలేరియా అధికారి ఓబులు మాట్లాడుతూ… ప్రస్తుతం
సీజనల్ వ్యాధులు ప్రబలే కాలం కావున ల్యాబ్ టెక్నీషియన్లు అందరూ తమ పరిధి లోని అర్బన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జ్వర లక్షణాలు వున్న వారికి రక్త పూత పరీక్ష లు తప్పకుండా తీసి పరీక్షలు జరిపి స్థానిక వైద్యాధికారి కి నివేదిక ఇవ్వాలని తెలిపారు. ల్యాబ్ రికార్డుల నిర్వహణ పక్కా గా నిర్వహిచవలెననీ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ మలేరియా అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ… క్షేత్ర స్థాయి సిబ్బంది అందించే రక్త పూతల పరీక్షల నిర్వహణ లో అలసత్వం వుండరాదు అని తెలిపారు. వారాంతపు రక్త పూతల రిపోర్టు ను జిల్లా కార్యాలయం నకు తప్పని సరిగా పంపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మలేరియా కార్యాలయ సిబ్బంది గిరిధర్ రెడ్డి, రమేష్, రాఘవ రెడ్డి హరికృష్ణ పాల్గొన్నారు.