శ్రీ సత్య సాయి భజన మండలి-పాత భజన మందిరం
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీ సత్య సాయి భజన మండలి-పాత భజన మందిరం వారు 250 మంది రోగులకు, సహాయకులకు పాలు, బ్రెడ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవాదళ్ సభ్యులు సాంబశివుడు, ఆచారి, నాగిరెడ్డి, జనార్ధన, అశోక్, కాకుమాని విద్యాసాగర్ లు వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సాయి సేవలో దాతగా డీకే తులసమ్మ వారి కుటుంబ సభ్యులు చేయిచతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. దాతల సహాయ సహకారంతో ఇటువంటి సేవా కార్యక్రమాలను పుట్టపర్తి సాయిబాబా ఆశీస్సులతో నిర్వహించడం మాకెంతో సంతోషంగానూ, తృప్తిగాను ఉంది అని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి మాట్లాడుతూ శ్రీ సత్య సాయి భజన మండలి వారు చేస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు రోగులకు వరంలాగా మారడమే కాకుండా ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలవడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగులు రోగుల తరఫున వారు కృతజ్ఞతలను తెలియజేశా రు.