విశాలాంధ్ర – ధర్మవరం : ఖాతాదారులకు మెరుగైన సేవలు అందజేయడం కరూర్ వైశ్య బ్యాంక్ లక్ష్యం అని బ్రాంచ్ మేనేజర్ సతీష్ కుమార్ తెలిపారు. స్థానిక నేసే పేటలోని కరూర్ వైశ్య బ్యాంకులో 108 ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకులో కరూర్ వైశ్యా బ్యాంక్ వ్యవస్థాపకుల చిత్రపటాలకు సిబ్బందితో కలిసి పూలమాలలు వేసి, ఘన నివాళి అర్పించారు. అనంతరం బ్రాంచ్ మేనేజర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ 107 సంవత్సరాలుగా కరూర్ వైశ్య బ్యాంక్ దేశవ్యాప్తంగా ఖాతాదారుల కు మెరుగైన సేవలందిస్తూ, కాలానుగుణంగా సాంకేతికంగా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెస్తూ ఖాతాదారుల నమ్మకాన్ని పొందిందన్నారు. ధర్మవరంలో సైతం సిబ్బంది సహాయ సహకారాలతో బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. అనంతరం బ్యాంక్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక కొత్తపేటలోని షిరిడి సాయిబాబా దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి, మండల పరిధిలోని గొట్లూరు అనాధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సిబ్బంది శివ ప్రసాద్,కృష్ణ, రాఘవేంద్ర, రాకేష్, భార్గవి, అరుంధతి తదితరులు పాల్గొన్నారు.