జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వి
విశాలాంధ్ర-అనంతపురం : రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి జయంతి రాష్ట్ర పండుగగా ఈనెల 17న జరుపుకోవాలని ప్రకటించింది. మహర్షి వాల్మీకి రాష్ట్రస్థాయి జయంతోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌలి శాఖ మంత్రివర్యులు ఎస్. సవిత పాల్గొంటారు. రాష్ట్రస్థాయి వేడుకలు అక్టోబర్ 17వ తేదీ అనంతపురంలోని గుత్తి రోడ్డు మార్కెట్ యార్డ్ పక్కన ఉన్నటువంటి బల్లా కన్ వెన్షన్ హాల్ నందు ఏర్పాట్ల ను మరియు పాతూరులోని పవర్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి వాల్మీకి విగ్రహం సర్కిల్ నందు జరిగే ఏర్పాట్లను బుధవారం రాష్ట్ర సంచాలకులు, బిసి వెల్ఫేర్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మల్లికార్జున.ఏ, ఐఏఎస్ తో కలసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా బిసి వెల్ఫేర్, మేనేజింగ్ డైరెక్టర్, జిల్లా కలెక్టర్ లు అధికారులకు సూచనలు, సలహాలను ఇవ్వడం జరిగింది. వాల్మీకి మహర్షి రాష్ట్రస్థాయి జయంతోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ బిసి -ఏ అడ్మినిస్ట్రేటివ్ సపోర్టింగ్ యూనిట్ ఉమాదేవి. జి, డిటిడబ్ల్యుఓ రామాంజనేయులు, బిసి వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, డిఆర్డిఏ పిడి ఈశ్వరయ్య, అనంతపురం అర్బన్ తహసీల్దార్ హరికుమార్, జిల్లా పరిషత్ సీఈవో వెంకట సుబ్బయ్య, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.