ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ కు వినతులు
విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురము నగర పాలక సంస్థ పరిధిలోని 40వ డివిజన లో మౌలిక వసతులు కల్పించాలని సోమవారం సిపిఐ శాఖ కార్యదర్శి మున్నాఫ్ అంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పార్వతమ్మ కాలనీలో 20 ఏళ్ళకు పైగా నివాసం వుంటూ ప్రభుత్వమును చెల్లించాల్సిన అన్ని పన్నులు చెల్లిస్తున్న ప్రజలకు ఇంటిపట్టాలు మంజూరు చేయాలన్నారు. సదరు కాలనీలో డి.నెం 6-623-15 నుండి 6-623-44 వరకు మరియు 6-223-210 నుండి 6-623-116వ నంబరు వరకు అల్లూరి సీతారామరాజు స్కూల్ వెనుక భాగమున రోడ్డు మరియు కాలువలు మంజూరైనవి, వీటిని వేయించవలసినదిగా కోరుచున్నాము. డి.నెం. 6-623-122 నుండి 6-623-126 వరకు 5 ఇండ్లకు మంచినీటి కొళాయి వసతి లేదు. కొళాయి కనెక్షన్ ఇప్పించవలసినదిగా కోరారు. జన్మభూమి రోడ్డు నందు గత టిడిపి ప్రభుత్వంలో మంజూరై సగం రోడ్డు వేయడం జరిగింది. గవర్నమెంట్ మారిన తరువాత మిగిలిన సగం పూర్తిచేయలేదు. కావున మిగిలిన సగం రోడ్డు పూర్తి చేయవలసినదిగా కోరారు. పై సమస్యలు పరిష్కరించి న్యాయము చేయవలసినదిగా వినతి పత్రం ద్వారా కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సి రాంబాబు, బి నాగమునమ్మ, జి లక్ష్మీదేవి, పి.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.