డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సేల్వియా సల్మాన్
విశాలాంధ్ర – ధర్మవరం:: ప్రస్తుతం రాష్ట్రంలో డయేరియా అనే వ్యాధి ప్రబలడంతో, ప్రజలకు అవగాహన కొరకు డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ సెల్వియా సాల్మన్ ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్లు వైద్య సిబ్బంది కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని సెల్వియా సాల్మాన్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ జూలై ఒకటో తేదీ నుంచి ఆగస్టు నెల వరకు డయేరియాను ఆపండి అనే కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుందన్నారు. గ్రామాలు పట్టణాలలో ఐదు సంవత్సరాల లోపు పిల్లల తల్లులకు ఓఆర్ఎస్ ను అందించాలని, సర్వేలో భాగంగా ఇంటింటికి తిరిగి డయేరియాతో బాధపడుతున్న వారిని గుర్తించి మందులను పంపిణీ చేయాలని తెలిపారు. గ్రామాలలో గల అన్ని పాఠశాలల్లో విద్యార్థులు హ్యాండ్ వాష్ గురించి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్ లో ఓఆర్ఎస్ కార్నర్ను ఏర్పాటు చేసి, అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై కూడా అవగాహన కల్పిస్తూ ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ మాధవి, ప్రాథమిక, అర్బన్ ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు పాల్గొన్నారు.