జాతీయ చేనేత సభ్యురాలు సంకారపు జయశ్రీ
విశాలాంధ్ర – ధర్మవరం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ విషయంలో తన హామీని నిలబెట్టుకోవడం ప్రజలకు ఒక వరంలాగా మారిందని జాతీయ చేనేత సభ్యురాలు సంకారపు జయశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ పిలుపుమేరకు వారు పలు వార్డుల్లో పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని 7,000 రూపాయలు ఒకేసారి పెన్షన్ దారులకు అందడం పట్ల వారి సంతోషం ఎనలేనిదని తెలిపారు. పెన్షన్ ఇంటిబద్దకే వచ్చి ఇవ్వడం మరింత సంతోషాన్ని కలిగించిందని వారు తెలిపారు. పెన్షన్ దారుల కళ్ళల్లో వారి ఆనందాన్ని చూడటం జరిగిందని. చంద్రబాబు హయాంలో మరింత అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.