విశాలాంధ్ర – ధర్మవరం : ధర్మవరం నియోజకవర్గంలోని చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ వారి జీవన అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని కోరుతూ జాతీయ చేనేత సభ్యురాలు సంకారపు జయ శ్రీ శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత కు వినతి పత్రాన్ని అందజేశారు. ఇటీవల చేనేత జౌళి శాఖ మంత్రిగా సవిత పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శుభాకాంక్షలు కూడా వారు తెలియజేశారు. అనంతరం జయశ్రీ తో పాటు పలువురు చేనేత నాయకులు ధర్మవరం చేనేత పరిశ్రమ, పరిశ్రమను నమ్ముకున్న చేనేత కార్మిక పరిస్థితులను సవితకు పూర్తిగా వివరించారు. గత ఐదు సంవత్సరాల కాలంలో చేనేత పరిశ్రమ పూర్తి కుంటపడిపోయిందని, వారి జీవన విధానం ప్రశ్నార్థకంగా మారిందని వారు తెలియజేశారు. ఇప్పటికైనా చేనేత పరిశ్రమను ఆదుకుంటూ, చేనేత కార్మికులకు సరైన న్యాయం చేయాలని వారు కోరారు. స్పందించిన మంత్రి సవిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వారు చేనేత పరిశ్రమ పైన, వాటి స్థితిగతులను నాకు తెలపడం జరిగిందని, తప్పకుండా ధర్మవరం చేనేత పరిశ్రమను చేనేత కార్మికులను ఆదుకుంటూ వారి జీవన అభివృద్ధికి తల వంతు కృషిని చేస్తానని హామీ ఇచ్చారు. ధర్మవరంలో పూర్వ వైభవం తెచ్చేలా ప్రభుత్వంతో చర్చించి, కావలసిన నిధులను కూడా సమకూర్చుతానని వారు తెలిపారు. అంతేకాకుండా ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ధర్మవరం చేనేత ప్రతినిధి జయశ్రీ, సమన్వయంతో ధర్మవరం చేనేతలకు తప్పనిసరిగా న్యాయం సమకూర్చేలా నిరంతరం తాను కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు. అనంతరం జయశ్రీ తో పాటు ధర్మవరం చేనేత నాయకులు మరోసారి మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం పార్థసారథి, తదితర చేనేత నాయకులు పాల్గొన్నారు.