విశాలాంధ్ర-తాడిపత్రి: మున్సిపల్ చైర్మన్ జెసి. ప్రభాకర్ రెడ్డి గురువారం తాడిపత్రి పట్టణంలోనికి అడుగు పెట్టడంతో పట్టణమంతా పసుపుమయమైనదని పలువురు అభిమానులు చెప్పారు. మొదటగా మునిసిపల్ చైర్మన్ జెసి. ప్రభాకర్ రెడ్డి కొద్ది రోజులగా హైదరాబాదులో ఆరోగ్యం బాగాలేక విశ్రాంతి తీసుకుని తాడిపత్రికి వస్తున్న సందర్భంగా జెసి అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జిల్లా సరిహద్దుల వద్దకు భారీ జన సంద్రోహంతో చేరుకుని గుత్తి బాట సుంకులమ్మ దగ్గర జేసీ ప్రభాకర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. జెసి ప్రభాకర్ రెడ్డి అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాట సుంకులమ్మ వద్ద నుండి సుమారు 300 వాహనాలతో బయలుదేరి రాయల చెరువులో భారీ జన సంద్రోహంతో అభిమానులు ర్యాలీ నిర్వహించారు. అలాగే చుక్కలూరు క్రాస్ మీదుగా వచ్చి ఆర్టీసీ బస్టాండ్, యల్లనూరు రోడ్డు, పుట్లూరు రోడ్డు, ముల్లంపుల్ సర్కిల్ మీదుగా ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డికి భారీ ర్యాలీతో జెసి అభిమానులు పూలమాల వేసి డ్రమ్స్ లతో డాన్సులు వేస్తూ టపాకాయలు పేలుస్తూ జెసి నివాసము వరకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.