ఏఐటీయూసీ, సిఐటియు నాయకుల డిమాండ్
విశాలాంధ్ర అనంతపురం : నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న రాపిడో టూవీలర్స్ ఆటోలపై చర్యలు తీసుకోండి .ఏఐటీయూసీ,సిఐటియు,మంగళవారం ఉమ్మడి ఆటో యూనియన్ల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య ఆహ్వానితులుగా ఏఐటియుసి సిఐటియు నాయకులు మల్లికార్జున వెంకటనారాయణ మాట్లాడుతూ… ర్యాపిడో ఆటో మరియు బైక్ వల్ల స్టాండ్ల వద్ద ఉన్న ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాపిడో ఓలా ఉబర్ యాప్ ల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా ఈ సంస్థల వారు విచ్చలవిడిగా యాప్ లో ఆన్లైన్ బుకింగ్ ఏర్పాటు చేశారన్నారు. తక్షణమే రాపిడో ఆన్లైన్ బుకింగ్ ను ఆపాలని డిమాండ్ చేశారు. లింకు లింకు ద్వారా ఇచ్చే ఈ సర్వీస్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. అర్ధరాత్రి టూ వీలర్ రాపిడో ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడం ద్వారా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయే అవకాశం ఉందన్నారు. ఇటీవల హైదరాబాద్ లో లింకు ద్వారా ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న ఓ మహిళపై ట్రాఫిక్ ఎక్కువగా ఉందని వేరే మార్గంలో తీసుకెళ్లి అఘాత్యానికి పాల్పడిన సంఘటనలు ఉన్నాయన్నారు. ఆటో డ్రైవర్ల అందరూ కూడా రాపిడో ఓలా ఉబర్ లాంటి సంస్థల పైన అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతపురంలో రాపిడో టూవీలర్ బైక్స్ మరియు ఆటోల ఆన్లైన్ బుకింగ్ రద్దు కోసం జిల్లాలోని ఆటో యూనియన్ యూనియన్లను ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆటో యూనియన్ నాయకులు శ్రీనివాసులు మరియు ఏఐటియుసి ఆటో యూనియన్ నాయకులుజిల్లా అధ్యక్షులు రాజు, కృష్ణానాయక్, జి.దుర్గా ప్రసాద్,జి.సురేష్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు