Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

కంటి వెలుగును సద్వినియోగం చేసుకోండి

డాక్టర్ ఉరుకుందప్ప

విశాలాంధ్ర – ధర్మవరం : కంటి వెలుగును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం పేద ప్రజలకు ఒక వరమని ఆప్తాలిక్ అధికారి డాక్టర్ ఉరుకుందప్ప పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం పట్టణంలోని 34వ వార్డు రాజేంద్రనగర్ లో గల ప్రాథమికోన్నత పాఠశాలలో వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించడంతోపాటు కొద్ది రోజుల్లోనే ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ కూడా చేయడం జరుగుతుందన్నారు. శాస్త్ర చికిత్సలు అవసరమైన వారికి సాధ్యమైనంత త్వరలో చికిత్సలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్లతో పాటు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img