Monday, May 20, 2024
Monday, May 20, 2024

ఏ పి సి యూ లో విజయవంతంగా టాటా కన్సల్టెన్సీ ప్రాంగణ ఎంపికలు

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఉపకులపతి ఆచార్య ఎస్ ఏ కోరి ఆధ్వర్యంలో అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ప్రఖ్యాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ నిర్వహించిన ప్రాంగణ ఎంపికలకు బుధవారం నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ… నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యాలయాలలోనే సిలబస్ లను రూపొందిస్తూ విద్యార్థులను తర్ఫీదు చేసే విషయంలో, వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే విషయంలో ఎన్నటికీ రాజీపడబోమని పేర్కొన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం మరియు ఇతర విద్యాలయాలలోని డిగ్రీ విద్యార్థులకు విద్యార్థుల కొరకు నిర్వహించబడిన ఈ ప్రాంగణ ఎంపికలలో 210 మంది రకరకాల కోర్సులలో చదువుతున్న విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునే క్రమంలో పోటీపడ్డారు. అనంతపురం నగరంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఎస్ ఎల్ ఎన్ డిగ్రీ కాలేజీ, వివేకానంద డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, రైపర్ డిగ్రీ కాలేజీ మరియు ఇతర డిగ్రీ కాలేజీలలో నుండి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img