జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర అనంతపురం : భారీ వర్షాల వల్ల నీరు వస్తున్నాడంతో నగరంలోని ఆర్డిటి పరిసర ప్రాంతాల పరిధిలోని రామకృష్ణ కాలనీ, పరిసర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరు బయటికి రాకూడదని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి సూచించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లో భారీ వర్షాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో నీరు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, ఆర్డిటి స్టేడియం పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎవరు కూడా బయటికి రాకూడదన్నారు. నగరంలోని రామకృష్ణ కాలనీ, పరిసర ప్రాంతాలలోని స్కూల్స్, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడం జరిగిందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకల కింద ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు.