సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పాల్యం నారాయణ స్వామి
విశాలాంధ్ర -శింగనమల : భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలంలోని అరకటవేముల,సూరేపల్లి గ్రామాల శాఖల సమావేశం శాఖా కార్యదర్శుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పాల్యం నారాయణ స్వామి , పుట్లూరు మండల కార్యదర్శి డి, పెద్దయ్య లు హాజరయ్యారు,ఈ సందర్భంగా పాల్యం నారాయణ స్వామి మాట్లాడుతూ! సిపిఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు గ్రామస్థాయి నుండి భారత కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేయాలని గ్రామాలకు వెళ్లి శాఖ సమావేశాలు నిర్వహించి శాఖలు ఉన్న గ్రామాలలో పల్లెనిద్ర చేసి అక్కడున్న సమస్యలను తెలుసుకొని పరిష్కారందిశగా కృషి చేయాలన్నారు, ప్రజా సమస్యలపై శాఖా కార్యదర్శులు సచివాలయాలలో అధికారుల ను సంప్రదించి పరిష్కరించాలన్నారు,
ఈ కార్యక్రమాలు గ్రామస్థాయి నుండి సిపిఐ నిబలోపేతం చేసుకోవాల్సిన అవసరంఉందన్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు సూపర్ సిక్స్ అని చెప్పి వృద్దులకు పించన్ వెయ్యి రూపాయలు తప్ప మిగతా హామీలు నెరవేర్సలేకపోతున్నారని .స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతున్న అందరికీ 15వేలు ఇస్తామనిచెప్పి 5 నెలలు గడుస్తున్నా తల్లుల అకౌంట్ లో డబ్బులు జమ చేయలేదని, రైతులు పండ్ల తోటకు,చామంతి తోటలకు ఎకరానికి 80వేలుపైనే పెట్టుబడి అప్పులు చేసి పంటలు సాగుచేస్తున్నారని, వరుస తుఫాన్ల వల్ల పంటలు దెబ్బ తీస్తున్నాయని ముఖ్యమంత్రి చెప్పిన రైతు భరోసా 20వేలు తక్షణమే రైతు ల అకౌంట్లో జమ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు అందించాలని, ఎందుకలా ముందు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే అమలు చేయకపోతే ప్రజలుసీఎం చంద్రబాబు కితగిన గుణపాఠం చెబుతారన్నారు, అనంతరం పల్లెనిద్ర కార్యక్రమంలో అరకటవేముల గ్రామంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దయ్య ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు హనుమంతు రాయుడు జిల్లా ఉపాధ్యక్షులు వంశీ సీపీఐ గ్రామ శాఖ కార్యదర్శి ఓబులపతి, లలితమ్మ, నాగేశ్వరమ్మ, బలరాముడు బలకొండయ్య, రామంజి, నాగేంద్ర, శేఖర్, సుబ్బన్న, కుళ్లాయప్ప, రాజు, అదెన్న , నాయుడు,తదితరులు పల్లెనిద్రలో పాల్గొన్నారు