ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : నియోజకవర్గంలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలకు తాబే ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, సతీమణి సుప్రియ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే స్వగృహంలో పార్టీ కార్యకర్తలకు ఆర్థిక సహాయాన్ని వారి చేతుల మీదుగా అందజేశారు. ఇందులో నియోజకవర్గంలోని తాడిమర్రి మండలం కునుకుంట్ల గ్రామానికి చెందిన సద్దల రామచంద్ర ఆచారి అనారోగ్యంతో ఇటీవలే మృతి చెందారు. కూతురు భారతి వివాహం అనే విషయాన్ని తెలుసుకొని ఆ కుటుంబానికి 25 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. తదుపరి ముదిగుబ్బ మండలం నాగారెడ్డిపల్లి కు చెందిన మంజుల నరేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు ఆ కుటుంబానికి 20వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. తదుపరి ధర్మవరం మండలం నేలకోట గ్రామానికి చెందిన అంజి నాయక్ జూనియర్ లైన్మెన్ వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు ఇటీవలే విద్యుత్ శాఖ గురై తన ఎడమ చేతిని కోల్పోయిన విషయాన్ని ఎమ్మెల్యే తెలుసుకొని, వారి ఇంటికి వెళ్లి మూడు లక్షల రూపాయలను ఆర్థిక సహాయముగా వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.