విశాలాంధ్ర/హైదరాబాద్: ఎమ్ఐసి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, రైలు డిస్ప్లే బోర్డ్ను మార్చడం, కొత్త ఏర్పాటు కోసం పశ్చిమ రైల్వే జోన్లోని రత్లాం డివిజన్ నుండి లెటర్ ఆఫ్ కంప్లీషన్/ఇన్స్టాలేషన్ సర్టిఫికేట్ను అందుకున్నట్లు సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫిరోజ్పూర్ డివిజన్లోని ప్రధాన స్టేషన్లలో కోచ్ గైడెన్స్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటు కోసం ఉత్తర రైల్వే జోన్లోని ఫిరోజ్పూర్ డివిజన్ నుండి అంగీకార పత్రాన్ని అందుకున్నట్లు ఇటీవల కంపెనీ ప్రకటించిందన్నారు. పేర్కొన్న వర్క్ ఆర్డర్ యొక్క మొత్తం విలువ రూ.3,04,95,149.54. ఇంకా, హాపా స్టేషన్లో డీడబ్ల్యుకే పీఎఫ్`1, సీజీబీడీ, ఐపీఐఎస్ సిస్టమ్ పనిని పూర్తి చేసినందుకు కంపెనీ పశ్చిమ రైల్వే జోన్లోని రాజ్కోట్ డివిజన్ నుండి లెటర్ ఆఫ్ కంప్లీషన్/ఇన్స్టాలేషన్ సర్టిఫికేట్ను అందుకుందన్నారు. ఇంతకుముందు, కంపెనీ ఒక అనుబంధ సంస్థను కలిగి ఉందని ప్రకటించింది.