ముంబయి : ఇప్పటి వరకు 99 ఏళ్ల వారసత్వం కలిగిన బ్రిటిష్ ఆటోమొబైల్ బ్రాండ్ ఎంజి మోటార్ ఇండియాను తన మొబిలిటీ పార్టనర్గా మార్చుకోవడం ద్వారా స్టార్టప్ ఇండియా, ఇన్వెస్ట్ ఇండియాతో కలిసి ‘స్టార్టప్20’ శిఖర్ కార్యక్రమానికి తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. తన ఎంజి డెవలపర్ అండ్ గ్రాంట్ ప్రోగ్రామ్ (ఎంజీడీపీ)తో కలిసి, దేశంలోని మొబిలిటీ స్పేస్లో ఆవిష్కరణ, ఎంటర్ప్యూనర్షిప్ను పెంపొందించేందుకు ఎంజి మోటార్ ఇండియా నిబద్ధతను ఈ సహకారం ప్రతిబింబిస్తుంది. ఈ సదస్సు సమ్మిట్ 2023 జూలై 3, 4 తేదీల్లో గుర్గావ్లో నిర్వహించారు. ‘స్టార్టప్ 20’ శిఖర్ కార్యక్రమానికి స్టార్టప్ ఇండియా, ఇన్వెస్ట్ ఇండియాతో భాగస్వామ్యం ద్వారా స్టార్టప్ ఎకోసిస్టమ్కు మద్దతు ఇవ్వడం, అర్ధవంతమైన సహకారానికి వేదికను అందించడంలో ఎంజి మోటార్ ఇండియా కృషి చేస్తుందని ఎంజి మోటార్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ గుప్తా తెలిపారు.