హైదరాబాద్: భారతీయ వ్యవసాయిక గ్రూప్ టాఫే మోటార్స్ అండ్ ట్రాక్టర్స్ లిమిటెడ్తో సహకారాన్ని ప్రకటించడం ద్వారా, ప్రపంచవ్యాప్తంగా అతివేగంగా ప్రగతి సాధిస్తున్న మార్కెట్లలో ఒకటైన భారతదేశంలో డాయిట్స్ తన ప్రణాళికలు విస్తరించనున్నట్టు తెలిపింది. టాఫేఅనుబంధ సంస్థ అయిన టాఫేమోటార్స్, ప్రపంచంలోఅతిపెద్దట్రాక్టర్తయారీదారులోఒకటి. 2023లో, భారత ఆర్థికరంగం 6 నుంచి 7 శాతం మేరకు ప్రగతి సాధించింది, 2050 నాటికి భారతదేశపు జిడిపి నాలుగింతలవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ బలమైన ప్రగతి సాధించడంలో వ్యవసాయం, నిర్మాణ రంగాలు పెద్ద పాత్రపోషించనున్నాయి. దీర్ఘకాల సహకారానికి ప్రారంభంగా, అన్ని ఉద్గార ప్రమాణాల్లోనూ ఈ గ్రూపు తయారు చేసే విస్తృతస్థాయి ఇంజన్లను మరింత పెంచడం, పరిపుష్టం చేయడానికికానుటాఫేమోటార్స్ వారు దాయిట్స్ తో 2.2లీ (50-75హెచ్పి), 2.2లీ (50-75హెచ్పి) విభాగాల్లో 30,000 వరకూ తయారు చేస్తారు. భారతీయ మార్కెట్ లో కొత్త అవసరాలకు సరిపోయేలా, అలాగే డాయిట్స్ కోసం టాఫేమోటార్స్ కొత్త ఇంజన్లను తయారు చేస్తుంది.