ముంబయి: అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఏటా జూన్ 21న జరుపుకుంటారు. మెరుగైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం కోసం యోగాను రోజువారీ జీవితంలో చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన పెంచడం ఈ రోజు లక్ష్యం. ఈ సందర్భంగా బాదంపప్పు తినడం ద్వారా యోగా ఆవశ్యకతను మరింత పెంచడం అవసరం. బాదంపప్పులో ప్రోటీన్, జింక్, మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం,ు విటమిన్ ఇ వంటి 15 ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. బాదంపప్పులు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి, బరువు, కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని మద్దతు అందిస్తాయి. ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా నిధులతో ఇటీవల విడుదల చేసిన విటార్డ్ అధ్యయనం వెల్లడిరచిన దాని ప్రకారం, బాదంపప్పులు కండరాల నొప్పులను తగ్గించడానికి, వ్యాయామాల అనంతరం రికవరీని మెరుగుపరచడంలో సహాయపడతాయని బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ అన్నారు. మాక్స్ హెల్త్కేర్లో రీజినల్ హెడ్ ఆఫ్ డైటెటిక్స్ రితికా సమద్దర్, న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి, ఫిట్నెస్,ు సెలబ్రిటీ ఇన్స్ట్రక్టర్ యాస్మిన్ కరాచీవాలా, పోషకాహార నిపుణులు డాక్టర్ రోహిణి పాటిల్, దక్షిణ భారత నటి ప్రణిత సుభాష్ తదితరులు బాదంపప్పు ప్రాధాన్యతను తెలియజేశారు.